Wednesday, May 15, 2024

కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న : షెడ్యూల్ ఖ‌రార్

ఈ నెల 19నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న ప్రారంభంకానుంది. కాగా వ‌న‌స‌ర్తి జిల్లా నుంచి కేసీఆర్ ప‌ర్య‌ట‌న ప్రారంభంకానుంది. 19వ తేదీన వ‌న‌ప‌ర్తి జిల్లాలో ఆయ‌న ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌నున్నారు. ఈ మేర‌కు డ‌బుల్ బెడ్రూం ఇళ్ళు, క‌ర్నెతాండ ఎత్తిపోత‌ల ప‌థ‌కం వేరుశనగ పరిశోధన కేంద్రం, కొత్త కలెక్టరేట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 20న జనగామ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ జిల్లాలో కూడా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నాగర్ కర్నూల్, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మ‌రి ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎవ‌రెవ‌రు పాల్గొంటారో తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement