Saturday, May 11, 2024

Katrina Kaif : మనసంతా వాటి పైనా…

‘మల్లీశ్వరి’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన కత్రినా కైఫ్‌ బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదిగింది. తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు కాస్త సన్నగిల్లాయి. ‘కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమే.. మంచి అవకాశాలను అందిపుచ్చుకుని మరోసారి బిజీ అవుతాన’ని నమ్మకంగా చెబుతున్నదీ క్యాట్‌.

- Advertisement -

‘హిందీలో బూమ్‌ తర్వాత తెలుగులో మల్లీశ్వరి సినిమాతో కెమెరా ముందు నటించడం ప్రారంభించాను. నా సినీ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నాను. కొన్ని సినిమాల తర్వాత దర్శకనిర్మాతలతో అన్ని విషయాలపైనా చర్చించడం అలవాటు చేసుకున్నాను. నేను అనుకున్నవన్నీ సాధించాను. ఇటీవల హాలీవుడ్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ చాన్స్‌ మిస్‌ చేసుకోవాల్సి వచ్చింది.

భవిష్యత్తులో మళ్లీ ఆఫర్‌ వస్తుందని ఆశిస్తున్నా. ఇకపోతే, నా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మంచి పాత్రలు ఎంచుకుంటున్నా. ఎలాంటి కథలు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారో అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నా. ఏదిఏమైనా నా మనసు మాత్రం సినిమాలపైనే ఉంటుంది.’ అని చెప్పుకొచ్చింది కత్రినాకైఫ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement