Monday, May 20, 2024

Award | రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న‌ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలలో చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించారు. కాగా, నేడు (గురువారం) సాయంత్రం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సీనియర్ నటి వైజయంతిమాలకు కూడా పద్మవిభూషణ్ పురస్కారం అందించారు.

పద్మ అవార్డుల ప్రదానోత్సవం గురువారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ఈ ఏడాది జనవరి 25న 132 మందికి అవార్డులు ప్రకటించగా… సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకు గాను ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఆయన స‌తీమ‌ణి సురేఖ, తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా హాజర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement