Monday, May 20, 2024

TS| కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తేనే మైనార్టీల‌కు మేలు: మల్లు రవి

  • మైనార్టీల‌కు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్
  • మరోసారి ఆదరిస్తే అభివృద్ధికి మ‌రింత‌ కృషి చేస్తాం
  • నాగ‌ర్‌క‌ర్నూల్‌ లోక్‌స‌భ‌ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి (ప్రభ‌ న్యూస్): దేశంలో మైనార్టీల‌కు అండగా ఉంటూ.. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామ‌ని కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ లోక్‌స‌భ‌ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి అన్నారు. ఇవ్వాల (గురువారం) జిల్లా కేంద్రంలోని మైనార్టీ హాల్‌లో సాయంత్రం జ‌రిగిన ఓ స‌మావేశంలో మాట్లాడుతూ.. మైనార్టీల రిజర్వేషన్ ఉండాలన్నా.. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా దేశంలో శాంతిభద్రతలు నిలబడాలన్నా.. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -

అందుకోసం మైనార్టీలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల‌ని మ‌ల్లు ర‌వి కోరారు. వారి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు, పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేందుకు ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమ‌లు చేస్తోంద‌న్నారు.

ఆరు గ్యారెంటీ ప‌థ‌కాల్లో ఇప్ప‌టికే కొన్ని అమ‌లు చేశామ‌ని మ‌ల్లు ర‌వి చెప్పారు. ఎన్నికల అనంతరం రైతులు, నిరుద్యోగులు, మహిళలు, పేదలకు ఉపయోగపడే మ‌రిన్ని పథకాలు తీసుకు వ‌స్తామ‌ని, నిరుపేదలకు అండగా ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల‌న్నారు.

రిజర్వేషన్ల‌ను నిలబెట్టుకునేందుకు లోక్‌స‌భ‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement