Tuesday, July 23, 2024

Delhi : క‌విత రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ మ‌ద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ రిమాండ్ పొడిగించారు. నేటితో క‌విత రిమాండ్ ముగియ‌డంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా సీబీఐ కేసులో జూన్ 3వ తేదీ వ‌ర‌కు క‌విత రిమాండ్‌ను పొడిగిస్తూ జ‌డ్జి కావేరి బ‌వేజా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

- Advertisement -

కాగా మ‌ద్యం కేసులో క‌విత‌ను మార్చి 15న హైద‌రాబాద్ లో ఆరెస్ట్ చేశారు.. అనంత‌రం ఆమెను ఢిల్లీకి త‌ర‌లించారు..అప్ప‌టి నుంచి ఆమె జ్యుడిషియల్‌ కస్టడీలో కొన‌సాగుతున్నారు… తిహార్ జైలులో ఆమెను ఉంచారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement