Friday, May 17, 2024

TS | ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. మే 2తో గడువు ముగియాల్సి ఉండగా.. మే 4 వరకు పొడిగించింది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. విద్యార్థులకు కళాశాలలో ఫీజు చెల్లించేందుకు మే 4 వరకు, ప్రిన్సిపల్స్ ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు మే 5 వరకు గడువు విధించారు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 24 నుంచి జూన్ 3 వరకు ఇంట‌ర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు జూన్ 4 నుంచి 8 వ‌ర‌కు ఇంటర్ ప్రాక్టిక‌ల్ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.460, ప్రాక్టికల్స్‌కు రూ.170, బ్రిడ్జి కోర్సులకు రూ.120 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం పరీక్ష ఫీజుతో పాటు ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకుంటే.. సైన్స్‌ విద్యార్థులు రూ.1200, ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement