Monday, April 29, 2024

అతనికి 21, ఆమెకు 35.. ఇద్దరు అడవిలోకి వెళ్లి..

కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెలో మహిళ, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. వేంపల్లె టౌన్ కు చెందిన నాగేంద్ర (21) యువకుడు రుక్మిణి (35) అనే మహిళ లక్కిరెడ్డిపల్లె మండలం నందివాండ్ల పల్లి సమీపంలోని కొండలో బుధవారం ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు వేంపల్లె పట్టణానికి చెందిన వారుగా గుర్తించారు. ద్విచక్ర వాహనంపై లక్కిరెడ్డిపల్లి నుంచి నంది వాళ్ల పల్లె రోడ్డు మార్గాన అడవిలోకి వెళ్లి ఇద్దరు చెట్టుకు ఉరి వేసుకొని  ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు తెలిపారు. ఈ మేరకు ఇరువురు బంధువులను పిలిపించి వారు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement