Tuesday, May 14, 2024

TS : ఇంటర్ ఫెలయ్యాయని విద్యార్థిని ఆత్మహత్య

నర్సింహులపేట, ఏప్రిల్29 (ప్రభన్యూస్): ఇంటర్ పరీక్షలో రెండు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రూపులతండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రచకృ తండాలో చోటుచేసుకుంది.

- Advertisement -

నర్సింహులపేట మండలంలోని రూపులతండ గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రచకృ తండాకు చెందిన గుగులోతు బీమాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందులో చిన్న కుమార్తె స్వాతి (17) తొర్రూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది.ఇటీవల వెలువడిన పరీక్షా ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయింది. దీంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగగా విషయం తెలుసుకున్న కుటుంబీకులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ కు తరలించారు.చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement