Wednesday, May 15, 2024

TS : ఇవాళ తెలంగాణలో జేపీ న‌డ్డా ప‌ర్య‌ట‌న‌

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందడి ఊపందుకుంది. ఈ నేప‌థ్యంలో వ‌రుస‌గా బీజేపీ ఆగ్ర‌నేత‌లు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. ఆయ‌న ఇవాళ రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -

కొత్తగూడెం, మహబూబాబాద్‌లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్వహించే బహిరంగ సభల్లో నడ్డా పాల్గొననున్నారు. సాయంత్రం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి కుత్బుల్లాపూర్ నిజాంపేటలో నిర్వహించే రోడ్ షోకు హాజరుకానున్నారు. రోడ్ షో అనంతరం హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గాల ముఖ్యనేతలతో నడ్డా సమావేశం కానున్నారు. సమావేశం ముగించుకున్న తరువాత రాత్రి హైదారాబాద్లోనే బస చేసి మరుసటి రోజు దిల్లీకి పయనం కానున్నారు. నడ్డా పర్యటనతో రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లలో నిమగ్నమయింది. ఆయన సభకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement