Monday, May 27, 2024

World Cup 2022- Ind Vs WI: నిరాశ పరిచిన మిథాలీ.. అర్ధ శతకంతో మెరిసిన మంధాన, హర్మన్‌

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న భారత మహిళా జట్టు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. సెడాన్‌ పార్కు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అదరగొట్టింది. అర్ధ శతకం పూర్తి చేసుకుంది. 67 బంతుల్లో 53 పరుగులు సాధించింది. హర్మన్‌ 52 పరుగులు చేసింది. అయితే, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మరోసారి నిరాశ పరిచింది. కేవలం 5 పరుగులకే పెవిలియన్‌ చేరింది. 35 ఓవర్లలో భారత్‌ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement