Saturday, May 25, 2024

India Corona: దేశంలో 4 వేల దిగువన కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3614 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,87,875 కు చేరింది. దేశంలో 89 మంది కరోనా బాధితులు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,15,803కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5185 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 4,24,31,513 కరోనాను జయించారు. ఇక దేశంలో 40,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 90. 91 శాతంగా ఉంది.  ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,79,91,57,486 5 కరోనా వ్యాక్సిన్లు అందించారు. నిన్న ఒక్కరోజే 18,18,511 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement