Thursday, May 16, 2024

మెగాస్టార్ కు నో చెప్పిన అనురాగ్ కశ్యప్ ఎందుకో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరోసారి రెండు సినిమాలను లైన్ లో పెట్టారు. వాటిలో ఒకటి లూసిఫర్ రీమేక్. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో చిరంజీవికి ప్రతినాయకుడిగా ఎవరు నటించబోతున్నారు అనేది గతంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ ప్లేస్ కు విలక్షణ నటుడు అనురాగ్ కశ్యప్ ను సంప్రదించారట చిత్రయూనిట్. కానీ అనురాగ్ తన సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నో చెప్పాడట. ఇక దీంతో తెలుగులోనే ఓ పవర్ ఫుల్ విలన్ ని పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ ఏడాదే షూటింగ్ ను ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. దీంతోపాటు చిరంజీవి వేదాళం సినిమాలో కూడా నటించబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement