Friday, April 26, 2024

లాభాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలను ఆర్జించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. తిరిగి మధ్యాహ్నం సెషన్ నుంచి లాభాల బాట పట్టాయి. 52,121 వద్ద ఉదయం ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ చివరకు 382 పాయింట్లు లాభపడి 52,232 వద్ద రోజును ముగించింది. 15,655 వద్ద రోజును మొదలుపెట్టిన నిఫ్టీ చివరకు 114 పాయింట్లు ఎగబాకి 15,690 వద్ద స్థిరపడింది. టైటాన్ కంపెనీ, ఓఎన్‌జీసీ, ఎయిచర్ మోటార్స్, లార్సన్ లాభాలను ఆర్జించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, సిప్లా, రెడ్డీస్ ల్యాబ్స్ నష్టాలను చవిచూశాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement