Friday, April 26, 2024

అదుపుతప్పి లారీ బోల్తా.. రెండు వేల కోళ్లు మృతి

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కోళ్ల ఫామ్ లారీ అదుపుతప్పి బోల్తా పడ్డ సంఘటన చోటు చేసుకుంది. చికెన్ షాప్ లకు కోళ్లను సరఫరా చేసే లారీ నరసరావుపేట నుండి గిద్దలూరుకు వెళుతుండ‌గా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో లారీలోని రెండువేల కోళ్లు చ‌నిపోయాయి. లారీ కింద‌కు స్కూటీ దూసుకెళ్లి నుజ్జునుజ్జు అయింది. రూ.5 లక్షల వరకు నష్టం జరిగినట్లు లారీ డ్రైవర్ తెలిపాడు. అతివేగంతో లారీ నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement