Sunday, April 28, 2024

Ongole – బాధ్యులపై కేసులు తప్పవు : ఎలక్షన్ కమిషన్ సీఈవో

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య జరిగిన ఘర్షణపై ఎన్నికల కమిషన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనా సీరియస్ గా స్పందించారు. ఒంగోలు ఘర్షణపై రాత్రి నుంచి కలెక్టర్, ఎస్పీ తమతో టచ్ లో ఉన్నారని సీఈవో తెలిపారు. ఈ గొడవపై పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా దృష్టికి కూడా తీసుకువెళ్లామని వివరించారు. గోడవలకు కారకులపై కచ్చితంగా కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు. స్టేట్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో విచారణ జరిపి తగు చర్యలు చేపడతామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement