Friday, May 3, 2024

AP | రేపటి నుంచి జగన్ ప్రచారం ప్రారంభం..

ఏపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా.. సీఎం జగన్ మ‌రో యాత్రకు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచార సభల్లో జగన్ పాల్గొననున్నారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు మూడు ప్రచార సభల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు.

28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు.. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ కు వైసీపీ ముఖ్య నేతలు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement