Wednesday, May 8, 2024

TS | బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ నామినేషన్ పై రగడ…ఈసీకి బీఆర్‌‌ఎస్‌ ఫిర్యాదు

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌పై బీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల గొడం నగేష్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో అన్ని కాలమ్‌లు ఫిలప్ చేయలేదని బీఆర్‌ఎస్ నాయకులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే బీఆర్ఎస్ ఫిర్యాదును రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని… బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం ఏకపక్షంగా పనిచేస్తోందని ఆరోపించారు.

తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన బీఆర్‌ఎస్ నేతలు దాసోజు, ఆశిష్‌… ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌, రిటర్నింగ్‌ అధికారిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నగేశ్‌ నామినేషన్‌ను తిరస్కరించేందుకు అన్ని ఆధారాలు చూపించినా.. బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ను ఆర్‌వోఏ తిరస్కరించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement