Sunday, May 19, 2024

TS | ఆ రెండు రోజులు మందు బంద్…

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు సంద‌ర్భంగా రెండు రోజుల పాటు మ‌ధ్యం దుకాణాలు మూత‌ప‌డ‌నున్నాయి. ఎన్న‌క‌ల వేళ‌ ఎలాంటి వివాదాలు, ఘర్షణలకు తావు ఉండకూడదని…. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎన్న‌క‌లు జ‌రిగేలా ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 48 గంట‌ల పాటు రాష్ట్రంలో డ్రై డ్రేగా ప్ర‌క‌టిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈ నెల (మే) 11న (శనివారం) సాయంత్రం 6 గంటల నుంచి మే 13న (సోమ‌వారం) సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ‌ద్యం దుకాణాల‌ను మూసివేయాల‌ని ఎక్సైజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వైన్ షాపుల‌తో పాటు క‌ల్లు కాంపౌండ్‌లు కూడా మూత ప‌డ‌నున్నాయి. అలాగే ఎన్నిక‌ల ఫ‌లితాల రోజైన జూన్ 4న వైన్ షాపులు మూత‌ప‌డ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement