Sunday, April 28, 2024

Chirala – వైసిపికి ఆమంచి కృష్ణ‌మోహ‌న్ గుడ్ బై…

బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమంచి భావించారు. గత ఎన్నికల్లో చీరాల వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కరణం బలరాం వైసీపీలో చేరారు. ఇదే స‌మ‌యంలో ఈ టికెట్ కరణం వెంకటేశ్‌కు ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు… దీంతో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. వాటిని చ‌ల్లార్చేందుకు ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు ఇంచార్జిగా నియమించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న పార్టీకి రాజీనామా చేశారు.. రెండు రోజుల‌లో కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement