Wednesday, April 24, 2024

ఉపాధి కూలీల‌కు దొరికిన వెండి నాణేలు..

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పని చేస్తుండగా కూలీలకు గురిగిలో వెండి నాణాలు లభ్యమ‌య్యాయి. గురిగిని పగలగొట్టి నాణాల‌ను కూలీలు పంచుకున్నారు. ఆలస్యంగా అధికారులకు విషయం తెలవడంతో నిన్న ఉపాధి పని దగ్గరకి వెళ్లారు. కూలీల‌ను త‌సిల్దార్ విచారణ చేసి నాణేలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గురిగిలో మొత్తం 30 వెండి నాణేలు దొరికినట్టు గ్రామస్తులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement