Friday, April 26, 2024

నెల్లూరు జిల్లా: రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

ప్రకాశం జిల్లాలో ప్రమాదవశాత్తు నలుగురు మృతి చెందారు. తర్లుబాడు మండలం కలజువ్వలపాడులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పొదిలి మండలం అక్కచెరువు గ్రామంలో ఓ పెళ్ళికి వెళ్తుండగా ఘటన జరిగింది. దోర్నాల నుంచి ఒంగోలుకు మినీ ట్రక్‌లో వెళ్తుండగా డోరు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటన సమయంలో వాహనంలో సుమారు పది మందిగా పైగా ప్రయాణిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి: త్వరలోనే జిల్లాలకు కొత్త గులాబీ బాస్‌లు: సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement