Thursday, May 16, 2024

శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా ప్రారంభమైన దసరా మహోత్సవాలు

శ్రీశైలం మ‌హాక్షేత్రంలో ద‌స‌రా మ‌హోత్స‌వాలు వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఉదయం యాగశాల ప్రవేశం, గణపతి పూజ అనంతరం అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో లవన్న దంపతులు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శిల్పా చక్రపాణి రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అక్టోబ‌ర్ 5వ తేదీతో ద‌స‌రా ఉత్స‌వాలు ముగియ‌నున్నాయి. ఉత్స‌వాల్లో భాగంగా ప్ర‌తిరోజు శ్రీస్వామి అమ్మ‌వార్ల‌కు విశేష పూజ‌లు, వాహ‌న‌సేవ‌లు, అమ్మ‌వారికి న‌వ‌దుర్గ అలంక‌ర‌ణ‌లు చేయ‌నున్నారు. లోక క‌ల్యాణం కోసం ప్ర‌తిరోజు జ‌పాలు, పారాయ‌ణాలు, రుద్ర‌యాగం, చండీయాగం నిర్వ‌హించ‌నున్నారు. ఇవాళ భ్ర‌మ‌రాంభ దేవి ఉత్స‌వ‌మూర్తికి శైల‌పుత్రి అలంకారం చేయ‌నున్నారు. స్వామి అమ్మ‌వార్ల‌కు భృంగి వాహ‌న‌సేవ నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement