Monday, July 22, 2024

AP : క‌ర్నూల్ జిల్లాలో అతిసారం…15మందికి అస్వ‌స్థ‌త‌

క‌ర్నూల్ః క‌ర్నూల్ జిల్లాలో బండి ఆత్మకూరు మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో బుధవారం రాత్రి నుండి వాంతులు విరోచనాలతో ప్రజలు అవస్థలు ప‌డుతున్నారు. సుమారు 15 మంది నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

కలుషితమైన త్రాగునీరు తాగ‌డం వ‌ల్లే వాంతులు, విరోచ‌న‌లు అవుతున్నాయ‌ని, ఇది అతిసారం కావ‌చ్చ‌ని గ్రామ‌స్తులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న బండి ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాదికారి భావన గ్రామంలో వైద్య శిభిరం ఏర్పాటు చేసిన వైద్య సేవ‌లు అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement