Tuesday, July 23, 2024

ADB : చెన్నూరులో బిఆర్ఎస్ నిరసన

చెన్నూర్, ప్రభన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ఎండగడుతూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఇవాళ‌ బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణం లోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహింకొత్త బస్టాండ్ ఎదురుగా బైఠాయించారు.

- Advertisement -

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల హామీలో బాగంగా రైతు పండించిన వరి ధాన్యం క్వింటాలకు 500 రూపాయలు బొనస్ చెల్లిస్తామని పేర్కొని ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే చెల్లిస్తూ రైతులను మోసం చేస్తోందని అన్నారు. బేషరతుగా ఇచ్చిన హామీ మేరకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు పక్షాన ఎంతటి పొరటానికైన బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement