Tuesday, July 23, 2024

AP : కారు బోల్తా… 15మంది భక్తులకు గాయాలు..

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో కారు వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108సిబ్బంది.. క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

25 మంది భక్తులు బుధవారం రాత్రి రెండు కార్ల‌లో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం బయల్దేరారు. శ్రీశైలానికి 15 కిమీ దూరంలో ఉండగా.. చెంచుగూడెంలో సమీపంలో ఒక కారు బోల్తా పడింది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement