Wednesday, May 8, 2024

ఎయిర్‌పోర్టులో చంద్ర‌బాబుకు ఘ‌న వీడ్కోలు

గ‌న్న‌వ‌రం, : విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ వెళ్లిన‌ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు.మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారం, పోలింగ్ ముగిసిన అనంత‌రం గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి చంద్ర‌బాబు గురువారం హైద‌రాబాద్ వెళ్లారు.ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ‌బాబుకు టీడీపీ గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జి, శాస‌న‌మండ‌లి స‌భ్యుడు బ‌చ్చుల అర్జునుడు ఆధ్వ‌ర్యంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. చంద్ర‌బాబు ఎయిర్‌పోర్టుకు చేరుకోవ‌డంతోనే జై చంద్ర‌బాబు అంటూ కార్య‌క‌ర్త‌లు నినాదాలు హోరెత్తించారు.విమానాశ్ర‌యంలో పార్టీ గ‌న్న‌వ‌రం ఇన్‌చార్జి బ‌చ్చుల అర్జునుడుతో కొద్దిసేపు మాట్లాడిన అనంత‌రం చంద్ర‌బాబు హైద‌రాబాద్‌కు ప‌య‌న‌మ‌య్యారు. చంద్ర‌బాబుకు వీడ్కోలు ప‌లికిన వారిలో టీడీపీ గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం కో ఆర్డినేట‌ర్ కోనేరు నాగేంద్ర‌కుమార్ (నాని), తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు మూల్పూరి సాయి కల్యాణి, గ‌న్న‌వ‌రం మండ‌ల అధ్య‌క్షుడు జాస్తి వెంక‌టేశ్వ‌ర‌రావు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బోడ‌పాటి ర‌వి, నాయ‌కులు ర‌ఫీ, నాదెండ్ల బ్ర‌హ్మం, జూప‌ల్లి సురేష్‌, మండ‌వ ల‌క్ష్మీ, బొడ్డ‌పాటి రాంబాబు, చీమ‌ల‌దండు రామ‌కృష్ణ‌, మండ‌వ అన్వేస్‌, బ‌డుగు కార్తీక్‌, గోపీనాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement