Friday, May 24, 2024

AP : మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకుందాం..ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాద్

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో ): ఒకవైపు ప్రజలకు సంక్షేమం అందించడంతోపాటు అభివృద్ధి చేయడమే ఎన్డీఏ కూటమి ముందున్న లక్ష్యం అని బిజెపి జనసేన పార్టీలు బలపరిచిన విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాద్(చిన్ని) పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ ఎన్టీఆర్ భవన్‌లో సోమ‌వారం ఆయ‌న మాట్లాడారు.

వైసిపి అసమర్ధ అరాచక, అవినీతి పాలనపై రాష్ట్ర ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారన్నారు. వైసిపి అధికార ప్రతినిధి యేలేశ్వరపు జగన్మోహన్ రాజు, నాగేంద్ర లు టిడిపి లో సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారని చెప్పరు. జగన్ నియంతృత్వ విధానాలు తో అందరూ విసిగి పోయారని, అందుకే వైసిపి లో ఉన్న నాయకులు, కార్యకర్తలు టిడిపి బాట పడుతున్నారని తెలిపారు. ముందు ముందు చాలా మంది ముఖ్య నేతలు టిడిపి లోకి వచ్చేందుకు సిద్దం గా ఉన్నారని చెప్పారు. కూటమి పార్టీ లు అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.అందరం కలిసి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం అని చెప్పారు.

- Advertisement -

మన పిల్లలు భవిష్యత్తు కోసం యన్డీఎ కూటమి విజయం ఎంతో అవసరం అన్నారు. ఈ ఐదు రోజులూ అందరూ కలిసి మెలిసి పని చేయాలన్నారు. తప్పకుండా దేశంలో మోడి, రాష్ట్రం లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేసి చూపుతాం అని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా యన్డీఎ పాలన సాగుతుందన్నారు. ఈ ఐదు రోజులు ప్రజల్లో ఉంటూ… మనం చేసే మంచిని వివరించాలన్నారు. యేలేశ్వరపు జగన్మోహన్ రావు మాట్లాడుతూ కులాలు, మతాల‌ ప్రాతిపదికన విడగొట్టడమే జగన్ నైజం అన్నారు. నోరు తెరిస్తే అన్నీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, బ్రాహ్మణులు అభ్యన్నతికి ఎనిమిది వందల కోట్లు ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు. నిజంగా కేటాయిస్తే ఆ డబ్బు ఎక్కడకి వెళ్లిందో సజ్జల సమాదానం చెప్పాలన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో బ్రాహ్మణులకు అన్యాయం జరిగిందన్నారు. యన్డిఎ కూటమి అధికారంలోకి రావాలి… అప్పుడే అందరకీ మేలు జరుగుతుందన్నారు. బ్రాహ్మణ సంఘాలు మొత్తం కూటమికే మద్దతు ఇస్తున్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement