Saturday, April 27, 2024

పెన్నా నదిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు

  • కడప జిల్లా పుష్పగిరి ఆలయం సమీపంలోని పెన్నా నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.వివరాల్లోకి వెళ్తే…….మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముద్దనూరు మండలం థర్మల్‌ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థులు.. వల్లూరు పరిధిలోని పుష్పగిరి పుణ్యక్షేత్రానికి వెళ్లారు.పుష్పగిరి కొండపై వెలసిన సంతాన మల్లేశ్వర స్వామి, చెన్నకేశవులను దర్శించుకున్నారు .అనంతరం కొండ దిగువన పెన్నానదిలో స్నానం చేసేందుకు వెళ్లారు.స్నానం చేస్తున్న క్రమంలో నది లోపలికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు అక్కడ ఊబిలో చిక్కుకుని గల్లంతయ్యారు.గల్లంతైన వారిని కార్తీక్‌, నందకిశోర్‌గా గుర్తించారు.స్థానికంగా ఉన్న ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement