Tuesday, April 16, 2024

రేపు కేంద్ర రైల్వేశాఖ మంత్రి తిరుపతి కి రాక

చిత్తూరు . కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు. ఈ పర్యటన లో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఈ నెల 12 న సా. 6.35 గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, అనంతరం సా. 7 గం. లకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చేరుకుని పూజలు నిర్వహించి రా. 9 గం.లకు తిరుమల చేరుకుంటారని తెలిపారు. 13 వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఉ.9.15 గం. లకు తిరుమల నుండి బయల్దేరి ఉ.10.15 రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ఉ. 10.50 లకు ఢిల్లీ బయల్దేరి వెళతారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement