Thursday, May 2, 2024

ఏపీలో కొత్తగా కరోనా 174 కేసులు…ఇద్దరు మృతి

ఏపీలో కరోనా కేసుల అలా అలా పెరుగుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 47,803 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 174 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా ఇద్దరు మృతి చెందారు.

అలాగే మరో 78 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా తాజాగా నమోదు అయిన కేసులతో కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,91,178 కి చేరుకుంది.కోలుకున్నవారి సంఖ్య 8,82,841 కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనా కారణంగా 7,179 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రం వ్యాప్తంగా 1158 చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement