Friday, May 17, 2024

AP : క‌డప జిల్లాలో ష‌ర్మిల ఎన్నిక‌ల ప్ర‌చారం

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గంలో ఆమె పర్యటన సాగనుంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా వైఎస్ షర్మిల ప్రచారం చేయనున్నారు.

- Advertisement -

కడప జిల్లాలోనే న్యాయయాత్ర పేరిట గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను పర్యటించిన షర్మిల వారం రోజుల పాటు కడప పార్లమెంటు పరిధిలోనే పర్యటించాలని నిర్ణయించారు. కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తుండటంతో షర్మిల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. గెలుపే లక్ష్యంగా ఆమె పర్యటన సాగనుంది. ఇవాళ ఉదయం వడ్డమాను గ్రామం నుంచి షర్మిల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement