Sunday, May 19, 2024

AP : వైసీపీని సాగనంపుదాం… సినీ నటులు నారా రోహిత్, రఘు..

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో): గడచిన ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిన వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపి, సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని ప్రముఖ సినీ నటులు నారా రోహిత్, రఘు లు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నందిగామ నియోజకవర్గం లోని చందర్లపాడు లో బిజెపి, జనసేన పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య, కేసినేని వెంకట తో కలిసి వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

సినీ నటులు ఎన్నికల ప్రచారంలో రావడంతో కార్యకర్తలు నాయకుల్లో నూతన ఉత్తేజాన్ని నిలిపింది. ప్రచార రథంపై అభిమానం చేస్తూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను అసమర్థపాలనను ఎండగడుతూ, చంద్రబాబు సారధ్యంలోని కోటమ్మ ప్రభుత్వం ఏర్పడితే వచ్చే ప్రయోజనాలను వివరిస్తూ వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement