Saturday, April 27, 2024

గుంటూరులో ఇద్దరు మైనర్ బాలురు, ఇద్దరు బాలికల అదృశ్యం..

గుంటూరులో నలుగురు మైనర్ల అదృశ్యం కలకలం రేపుతోంది. ఒకేసారి ఇద్దరు మైనర్ బాలురు, ఇద్దరు మైనర్ బాలికలు కనిపించకుండా పోయారు. వీరు నలుగురు నగరంలోని నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందినవారు. అదృశ్యమైన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. దీనిపై గతరాత్రి కొత్తపేట పోలీసులకు బాలల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.కాగా, ఈ ఘటనపై గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. సీఐ, ఎస్సై స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు షురూ చేశారు. మైనర్ బాలలు ఊరు విడిచి వెళ్లారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించారు.

ఇది కూడా చదవండి: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదు: కేంద్రం

Advertisement

తాజా వార్తలు

Advertisement