Friday, April 26, 2024

కూకట్‌పల్లిలో ఏటీఎం చోరీకి విఫలయత్నం

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. గురువారం అర్ధరాత్రి కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో గర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఏటీఎంలో డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఏటీఎం మెషిన్‌ తెరుచుకోకపోవడంతో దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఏటీఎంను పరిశీలించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: బోర్డింగ్‌ స్కూల్‌లో 26 మంది విద్యార్థులకు కరోనా

Advertisement

తాజా వార్తలు

Advertisement