Wednesday, May 1, 2024

Marripeda – హర్వెస్టర్ ఢీ – రైతు మృతి


మరిపెడ, ఏప్రిల్26 (ప్రభ న్యూస్) : మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలంలోని గాలివారిగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో వరి పంటను కోస్తుండగా వరి కోసే యంత్రం (హార్వెస్టర్) ఢీకొని టీలావత్ తండాకు చెందిన టీలావత్ వెంకన్న (36) శుక్రవారం తెల్లవారుజామున అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు

. హార్వెస్టర్ ద్వారా కోసిన వరి ధాన్యాన్ని తన ట్రాక్టర్ ద్వారా తరలించడానికి వచ్చిన వెంకన్న, వరి కోస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హార్వెస్టర్ ఢీకొని, దాని కిందపడి మృతి చెందాడు.సమాచారం తెలుసుకున్న మరిపెడ రెండో ఎస్సై సంతోష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా, మృతుడు వెంకన్నకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement