Monday, May 20, 2024

TS | ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు.. మోదీపై రేవంత్ ఫైర్‌

ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కర్నాటకకు చెంబు, ఆంధ్రప్రదేశ్‌కు మట్టి, చెంబు నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని సీఎం రేవంత్ విమర్శించారు. తెలంగాణకు ఈ గుడ్డు ఇచ్చినందుకు బీజేపీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం భూపాలపల్లిలో జ‌రిగిన‌ జనజాతర సభలో మాట్లాడుతూ… అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని ఎద్దేవా చేశారు.

వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు రాకుండా ప్రధాని మోదీ అడ్డుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు. రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ 400 సీట్లలో గెలిపించాలని అడుగుతోందన్నారు. రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నార‌ని ఫైర్ అయ్యారు.

- Advertisement -

సాధారణంగా సీతారాముల కల్యాణం చేసిన తర్వాత అక్షితలు ఇస్తారని, కానీ కల్యాణం జరగకముందే బీజేపీ నేతలు ఇక్కడ అక్షితలు పంచారని రేవంత్‌ మండిపడ్డారు. రాముడిని బీజేపీ అవమానించిందన్నారు. తామంతా రాముని భక్తులమేనని స్పష్టం చేశారు. తమకంటే గొప్ప హిందువులు ఉన్నారా? అని ప్రశ్నించారు. హిందువులను తాము ఓటు బ్యాంకులాగా ఉపయోగించుకునేది లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement