Tuesday, July 23, 2024

Chennai : ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. 1.8 కోట్ల విలువైన బంగారం సీజ్

ఇతర దేశాల నుంచి ఇండియాకు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వారిపై కస్టమ్స్ అధికారులు నిత్యం నిఘా పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ చెన్నై ఎయిర్‌పోర్టులో ప్రయాణికు లగేజీలో తనిఖీలు చేపట్టగా సుమారు రూ.1.8 కోట్ల విలువ చేసే బంగారాన్ని సీజ్ చేశారు.

- Advertisement -

అయితే, దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చిన విమానంలో వచ్చిన ప్రయాణికుడిని సోదా చేయగా అతడి బూట్లలో దాచి ఉంచిన రూ.85 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ముద్దను గుర్తించారు. అందేవిధంగా బ్యాంకాక్ నుంచి చెన్నైకి అదే సమయంలో వచ్చిన మరో విమానం లో 40 ఏళ్ల మహిళను సోదా చేయగా రూ.23 లక్షల విలువ గల 350 గ్రాముల బంగారు గొలుసులు, బ్రాస్‌లైట్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement