Friday, July 26, 2024

World Para Athletics : భారత అథ్లెట్ దీప్తి జీవం జీ…. వరల్డ్ రికార్డ్

భారతదేశానికి చెందిన మహిళా అథ్లెట్ దీప్తి జీవం జీ.. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్-2024లో చరిత్ర సృష్టించింది. ఈ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన 20 ఏళ్ల దీప్తి.400 మీటర్ల ఈవెంట్ ను 55.07 సెకన్లలో పూర్తి చేసి వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది.

- Advertisement -

పోయిన సంవత్సరం పారిస్ లో జరిగిన పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో అమెరికాకు చెందిన బ్రెన్నా క్లార్క్ 55.12 సెకన్లలో 400 మీటర్ల రేసును పూర్తి చేసుకుని రికార్డు క్రియేట్ చేయగా.. తాజాగా భారత్ యువ అథ్లెట్ దీప్తి జీవంజి 55.07 సెకన్లలో పూర్తి చేసి.. సరికొత్తి రికార్డును తన పేరు మీద రాసుకుంది. అలాగే త్వరలో జరగబోయే 2024 పారిస్ పారా ఒలింపిక్స్ కు ఆమె అర్హత సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement