Monday, May 20, 2024

Breaking | క‌ష్టాల్లో ముంబయి జట్టు.. అయిదు ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు ఫట్​!

టాస్ ఓడిన‌ప్ప‌టికీ తొలిసారి బ్యాటింగ్‌కు దిగిన‌ ముంబ‌యి ఇండియ‌న్స్‌ని క‌ష్టాలు వెంటాడుతున్నాయి. సొంత‌గ‌డ్డ‌పై ల‌క్నో పేస‌ర్లు విజృంభించ‌డంతో కేవ‌లం అయిదు ఓవ‌ర‌ల్లోనే కీల‌క‌మైన నాలుగు వికెట్లు కోల్పోయింది. బ‌ర్త్‌డే బాయ్ రోహిత్ శ‌ర్మ‌(4)ను మొహ్సిన్ ఖాన్ చేయ‌గా.. మిస్ట‌ర్ 360 సూర్య‌కుమార్ యాద‌వ్‌(10)ను రాహుల్ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో వెన‌క్కి పంపాడు.

తిల‌క్ వ‌ర్మ (7) ర‌న్ అవుట్ కాగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (0) డ‌క్ అవుట‌య్యాడు. దీంతో 27 ప‌రుగుల వ‌ద్ద అయిదు ఓవ‌ర్ల‌లోనే ముంబ‌యి నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్ర‌స్తుతం ఇషాన్ కిష‌న్ (27), వ‌ధేరా (12) ప‌రుగుల‌తో ఉన్నారు. వీరిద్ద‌రు ఆచితూచి ఆడుతున్నారు. ప్ర‌స్తుం 11.4 ఓవ‌ర్ల‌లో 66 ప‌రుగుల‌తో ముంబ‌యి నిల‌క‌డ‌గా ఆడుతోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement