Tuesday, May 21, 2024

TS | సైనికుడిలా పనిచేసి.. సమస్యలన్నీ పరిష్కరిస్తా: నీలం మధు

  • నిజాంపూర్ నుంచి కోల్కూరు, మొట్ పల్లి వరకు బైక్ ర్యాలీ
  • TSIIC చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు నిర్మల జగ్గారెడ్డి, పుల్లిమామిడి రాజుతో రోడ్ షో

లోక్‌స‌భ‌ ఎన్నికల్లో తనను గెలిపిస్తే, సైనికుడిలా పనిచేసి, సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ మెదక్ లోక్‌స‌భ‌ అభ్యర్థి నీలం మధు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లోని నిజాంపూర్ నుంచి కోల్కూరు, మొట్‌పల్లి వరకు బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ నేత పులి మామిడి రాజుతో కలిసి నీలం మధు రోడ్ షో చేపట్టారు.

- Advertisement -

ఈ సందర్భంగా నీలం మధు కొల్కూరు, మొట్పల్లి కార్నర్ మీటింగ్‌లలో మాట్లాడారు. ఈ ఎన్నికల తర్వాత అర్హులైన పేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తామ‌ని అన్నారు. నాడు పేదలకు అసైన్డ్ భూములు, ఇండ్లు అందజేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని నీలం మ‌ధు చెప్పారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, యువతకు మరింత మేలు జరగనుందని అన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించి, పార్లమెంటుకు పంపాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మాణిక్ రెడ్డి, భూపాల్ రెడ్డి, సుభాష్ రెడ్డి, సెల్వ రాజు, లక్ష్మారెడ్డి, సంగయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, ఇత‌ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement