Saturday, July 27, 2024

TS : అధికారుల‌పై రైతులు గ‌రం..గ‌రం..

రైతులు అకాల వర్షంతో వడ్లు మొలకెత్తడంతో రైతులు ఆగ్ర‌హించారు. తాజా మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మాసాయిపేట ఉప తాసిల్దార్ శ్రీకాంత్, ఆర్ ఐ తన్సింగ్, అధికారులను క‌లిసి మొలకల వడ్లును చూపిస్తు నిరస‌న వ్య‌క్తం చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఉప తాసిల్దార్ మాట్లాడుతూ మూడు రోజులు గడువు తీసుకొని అన్ని వడ్లను రైస్ మిల్ తరలిస్తామని హామీ ఇచ్చారు. రైస్ మిల్క్ తరలిస్తామని మొలకెత్తిన వడ్లు కూడా తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పసుల కిష్టయ్య, మాజీ సర్పంచ్ చిటిమల నాగరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement