Tuesday, May 21, 2024

ADB – చేరికలపై కంది వర్గం భగ్గు… భగ్గు – సుజాత, సాజిద్ దిష్టిబొమ్మ దగ్ధం…



ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్): అసమ్మతి నేతల చేరికలతో ఆదిలాబాద్ కాంగ్రెస్ లో గ్రూపులు మరోసారి భగ్గుమన్నాయి. మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గంద్రత్ సుజాత, కాంగ్రెస్ తిరుగుబాటు నేత అల్లూరి సంజీవరెడ్డిల పై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు ఎత్తివేయగా వారంతా మంగళవారం గాంధీభవన్లో కాంగ్రెస్ లో చేరారు. చేరికల తాజా పరిణామాలను కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం వ్యతిరేకిస్తూ మంగళవారం రాత్రి కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజా భవన్ కార్యాలయం ఎదుట దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

సుజాత, సాజిద్ ఖాన్, అల్లూరి సంజీవరెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను దగ్ధం చేసి కాంగ్రెస్ ద్రోహులారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. గతంలో కాంగ్రెస్ ను తిట్టిన నేతలంతా పార్టీలోకి ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు గిమ్మ సంతోష్, మునిగేలా నర్సింలు, శ్రీలేఖ, జహీర్ రంజాని, కల్లాల శ్రీనివాస్, బూర్ల శంకరయ్య, కుర్ర నరేష్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement