Wednesday, May 1, 2024

Campaign – నేడు పెద్ద శంకరంపేటలో రేవంత్ రెడ్డి జన జాతర

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు..

వరుస సభలు, సమావేశాలకు హాజరవుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. పెద్ద శంకరంపేటలో ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం ఇప్పటికే స్థానిక నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement