Wednesday, May 22, 2024

ADB: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ప్రభ న్యూస్: కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు తిరిగి పార్టీలో చేరిన మాజీ పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు అంబకంటి అశోక్ బుధవారం హైదరాబాదులో కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు వెంనరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

సస్పెన్షన్ వేటు ఎత్తివేత అనంతరం మంగళవారం గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆదిలాబాద్ సీనియర్ నేతలను వేంనరేందర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అదిలాబాద్ జిల్లాలో రాజకీయ పరిస్థితుల గురించి వేం నరేందర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పని చేయాలని కోరారు. వారి వెంట గండ్రత్ ఆశన్న కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement