Thursday, April 25, 2024

బోర్డింగ్‌ స్కూల్‌లో 26 మంది విద్యార్థులకు కరోనా

కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని పలువురు హెచ్చరిక చేసిన నేపథ్యంలో ముంబైలోని ఓ బోర్డింగ్‌ స్కూల్‌లో 26 మంది విద్యార్థులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. అగ్రిపద ఏరియాలో ఉన్న సెయిట్‌ జోసెఫ్‌ బోర్డింగ్ స్కూలులో 26 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. పాఠశాలలో ఉన్న 95 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 26 మందికి పాజిటివ్ అని తేలిందని అధికారులు వెల్లడించారు.

కాగా బాధితుల్లో 12 ఏళ్ల లోపు వయస్సున్నవారు నలుగురు ఉన్నారని అధికారులు తెలిపారు. వారిని నాయర్ ఆస్పత్రికి తరలించామన్నారు. మిగిలిన 22 మందిని రిచర్డ్ సన్ క్వారంటైన్ సెంటర్‌కు తరలించామని చెప్పారు. కరోనా నిలయంగా మారిన సెయింట్‌ జోసఫ్‌ బోర్డింగ్‌ స్కూల్‌ను బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు సీజ్‌ చేశారు.

ఈ వార్త కూడా చదవండి: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదు: కేంద్రం

Advertisement

తాజా వార్తలు

Advertisement