Friday, April 26, 2024

తిరుపతి ఉప ఎన్నిక ప్రశాంతం – 64.29శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంటరీ నియో జకవర్గ ఉప ఎన్నికల్లో సుమారు 64.29శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ వెల్లడించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని సిఇఓ తెలిపారు.అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి .సర్వేపల్లి 66.19శాతం. గూడూరు. 63.81. సూళ్లూరుపేట. 70.93. వెంకటగిరి. 61.51 తిరుపతి. 50.58 .శ్రీకాళహస్తి. 67.77. సత్యవేడు. 72.68 శాతం పోలింగ్ నమోదైందని సిఇఒ తెలిపారు.పోలింగ్ ముగిసే సమయానికి అనగా రాత్రి 7గం.లకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లో ఉన్న వారందరికీ వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించినందున తుది పోలింగ్ శాతానికి సంబంధించి రిటర్నింగ్ అధికారుల నుండి ఇంకా పూర్తి నివేదిక అందాల్సి ఉందని సిఇఒ తెలిపారు.ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం 64.29శాతం పోలింగ్ నమోదైందని సిఇఒ విజయానంద్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement