Friday, April 26, 2024

క్యాసినో, పేకాట రుజువు చేస్తే రాజ‌కీయ స‌న్యానం, ఆత్మహత్య చేసుకుంటా : కొడాలి నాని

గుడివాడ‌లో త‌న క‌న్వెన్ష‌న్ల‌లో క్యాసినో, పేకాట ఆడిన‌ట్లు రుజువు చేస్తే రాజ‌కీయ స‌న్యాసం చేసి, ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో క్యాసినో అంశంపై టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి కొడాలి నానిని టీడీపీ నేత‌లు టార్గెట్ చేయ‌గా, దీనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కొడాలి నాని. తనకు చెందిన కళ్యాణ మండపంలో క్యాసినో, పేకాటలు నిర్వహించినట్లు నిరూపిస్తే..రాజకీయాలను వదిలేస్తానని సంచలన ప్రకటన చేశారు. నిరూపించకుంటే..చంద్రబాబు, లోకేష్ లు ఏం చేస్తారో చెప్పాలంటూ నిలదీశారు.

అంత‌కంటే ముందు క్యాసినో నిర్వహణపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ బృందం పర్యటిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గుడివాడ వీధులు రాళ్ల దాడితో అట్టుడికాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. రాళ్ల దాడిలో టీడీపీ నేత బోండా ఉమ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులే అద్దాలు పగులకొట్టించారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement