Saturday, April 27, 2024

జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు చేసిన వ్యక్తి అరెస్ట్

గతేడాది న్యాయస్థానాలు కొన్ని కేసుల్లో ప్రభుత్వ వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులపై అప్పట్లో సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు దర్శనమిచ్చాయి. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి కడప జిల్లాకు చెందినవాడని గుర్తించారు. ఈ వ్యాఖ్యలపై సుమోటోగా స్వీకరించిన హైకోర్టు దర్యాప్తు బాధ్యతలు సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు సివిల్ కోర్టులో హాజరుపరిచారు. ప్రాథమిక విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. దాంతో అతడిని జిల్లా జైలుకు తరలించారు.గతేడాది దీనిపై తీవ్రంగా స్పందించిన ఏపీ హైకోర్టు జడ్జిలపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేసేవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తుకు సహకారం అందించాలంటూ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా అరెస్ట్ జరిగినట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం..

Advertisement

తాజా వార్తలు

Advertisement