Thursday, April 25, 2024

కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం..

కూకట్ పల్లి శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రశాంత్ నగర్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ కంపెనీలో భారీగా మంటలంటుకుని ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. కెమికల్ డ్రమ్ములు పేలుతుండడంతో భారీ శబ్ధాలు వస్తున్నాయి. దీంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. ఈ ఫ్యాక్టరీ ఎవరిది.. ఎంత మేరకు ఆస్తినష్టం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సిఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వైఎస్‌ వారసులకి తెలంగాణలో స్థానంలేదు: షర్మిలకు హరీష్‌ రావు కౌంటర్

Advertisement

తాజా వార్తలు

Advertisement