Friday, April 26, 2024

విద్యాసంస్థల బంద్ సంపూర్ణం

ధర్మవరం అర్బన్- కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ తో పాటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నీ విడుదల చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన భారత్ బందులో భాగంగా శుక్రవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఇడపబత్తిని ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పోతులయ్య, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి విజయ్, తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని విశాఖ ఉక్కు ప్రైవేటుగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు నరేంద్ర, చైతు,గణేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement